"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|

0
337

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. 

వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, డప్పుల వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

టపాసులు కాలుస్తూ, భారత్ మాతాకీ జై.. మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆల్వాల్ ప్రాంతాన్ని మార్మోగించారు. మోదీ సభకు వెళ్లే ముందు కార్యకర్తల ఉత్సాహం చూసిన స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చింతల మాణిక్య రెడ్డి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది. అందుకే ఆల్వాల్ సర్కిల్ నుంచి స్వచ్ఛందంగా వేలాదిమంది సభకు తరలివచ్చారు.

దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మోదీజీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు.

కార్తీక్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రవంతి, మహేందర్ రెడ్డి, సుజాత, లక్ష్మణ్, చరణ్, సచిన్, విజయ్, సర్వేశ్వర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆల్వాల్ సర్కిల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-03-09 08:07:34 0 149
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను సన్మానించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి కష్టసుఖాల్లో...
By Benguluri Madhubabu 2026-03-29 12:22:14 0 241
Andhra Pradesh
మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ...
By Pagadala Venkateswar 2026-04-08 05:55:48 0 148
SURAKSHA
Safe Hubs: How BRISP Reinvents Industrial Security
Rapid industrial growth requires robust protection, and the Baddi Region Industrial Security Plan...
By Lokeshwari Panthadi 2026-07-03 10:37:40 0 45
Andhra Pradesh
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2026-02-10 10:33:07 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com