"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|

0
133

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. 

వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, డప్పుల వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

టపాసులు కాలుస్తూ, భారత్ మాతాకీ జై.. మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆల్వాల్ ప్రాంతాన్ని మార్మోగించారు. మోదీ సభకు వెళ్లే ముందు కార్యకర్తల ఉత్సాహం చూసిన స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చింతల మాణిక్య రెడ్డి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది. అందుకే ఆల్వాల్ సర్కిల్ నుంచి స్వచ్ఛందంగా వేలాదిమంది సభకు తరలివచ్చారు.

దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మోదీజీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు.

కార్తీక్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రవంతి, మహేందర్ రెడ్డి, సుజాత, లక్ష్మణ్, చరణ్, సచిన్, విజయ్, సర్వేశ్వర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆల్వాల్ సర్కిల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్...
By Sidhu Maroju 2026-03-13 09:00:18 0 138
Telangana
దస్తూరాబాద్: పాటశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల...
By Mitappaly Shiavji 2026-01-09 07:23:53 0 343
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 269
Andhra Pradesh
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో! 👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 11:39:41 0 222
Mizoram
Mizo Ginger Goes Global: A ₹189 Crore Game Changer
Mizoram’s agricultural sector is celebrating a massive milestone today. The Central...
By Dunna Jessicaruth 2026-05-15 11:07:10 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com