చింతూరులో వీధి కుక్కల బీభత్సం.

0
99

చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా ఆవులపై గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం గత పది రోజుల క్రితమే ఒక తల్లి ఆవుపై దాడి చేసిన కుక్కల మంద, దాన్ని చంపి తినేశాయి. ఆ ఘటన మరువక ముందే, తాజాగా ఆ తల్లి ఆవు దూడను కూడా అదే రీతిలో చంపి తినేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. కుక్కలు మృగాల్లా మారి ఇలా వరుసగా పశువులపై దాడులు చేస్తుండటంతో అటు పశుపోషకులు వణికిపోతున్నారు ఆవులపై ఈ కుక్కల గుంపులు పడి, వాటిని పీక్కుతింటున్న వైనం స్థానికులను కలచివేస్తోంది.కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఈ కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని, ప్రజల ప్రాణాలకు, పశువులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
NTPC Triggers Green Energy Shift in Port Blair
In a significant push for carbon neutrality, NTPC Limited has officially invited bids for a...
By Dunna Jessicaruth 2026-05-14 09:29:06 0 37
Andhra Pradesh
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం సీఎం చంద్రబాబు కి వినతి పత్రం
జాతీయ ఉపాధి హామీ పథకం కోసం ఖర్చు అయ్యే నిధుల్లో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే ఖర్చు...
By Rajini Kumari 2025-12-23 07:19:35 0 160
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 282
Andhra Pradesh
విజయవాడ కమిషనర్ రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సు
*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-21 14:47:42 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com