కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని

0
157

*ప్రెస్ నోట్*

 

9-5-2026

 

*కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*

 

 

*విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త*

 

*ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన*

 

*మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు*

 

*సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని*

 

 

విజయవాడ( ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు.కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది.మూడు నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాలు లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

 

కొండ ప్రాంతాల్లో నివసించే వారు విజయవాడలో ఎక్కువగా తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారని అలాంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మరొకసారి నిరూపణ అయిందని ఎంపీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటు బ్యాంకు గానే చూసిన పార్టీలు ఉన్నాయి కానీ వారిని ఆదుకున్నది మాత్రం కేవలం కూటమి ప్రభుత్వమేనని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని ఎంపీ అన్నారు. త్వరలోనే 30 వేల మంది చిరకాల కోరిక సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం **
*ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరం* మార్కాపురం జిల్లా. పెద్ద దోర్నాల. మండల స్థానిక శివసదనంలో శంకర...
By Chennaiah Kati 2026-03-03 13:05:51 0 232
Karnataka
Political Shuffles: CM Siddaramaiah Headed to Delhi
Karnataka Chief Minister Siddaramaiah has been called to New Delhi for high-level meetings with...
By Dunna Jessicaruth 2026-05-25 06:16:20 0 126
Business & Finance
Kerala Tourism Sees Strong Monsoon Bookings
Kerala's tourism industry is witnessing strong monsoon bookings as domestic travelers...
By Navya Sree 2026-07-06 07:31:32 0 89
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 144
Andhra Pradesh
గోవులకు సేవ చేస్తున్న ధర్మాత్ముడు
విశాఖ పట్టణానికి చెందిన ఓవ్యక్తి గోసేవలు చేస్తున్నారు. వివరాలకు వెళితే భీమిలి నియోజక వర్గం లో గల...
By Mobbu Venkatramana 2026-03-22 08:32:44 0 399
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com