పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.

0
178

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు , పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు సబ్సిడీ అందిస్తోంది.ఆసక్తి గల రైతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.రైతులు తమ వివరాలను eseed.ap.gov.in/FM/Portal వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం లేదా దరఖాస్తు ప్రక్రియలో సహాయం కోసం రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకులను (VAA) సంప్రదించాలని అధికారులు కోరారు. ఆధునిక యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.

 

# Yadagiri 

 

Search
Categories
Read More
Uttar Pradesh
UP Strengthens Rural Development and Panchayati Raj
Uttar Pradesh continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 11:30:32 0 27
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 161
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 334
Telangana
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన...
By Pinnehasan Odela 2026-02-02 14:50:24 0 281
Business & Finance
KSUM Drives Startup Growth in Thiruvananthapuram
Kerala Startup Mission (KSUM) continues to strengthen the startup ecosystem by providing funding,...
By Navya Sree 2026-06-30 08:00:11 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com