రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.

0
106

రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం

ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

 

విజయవాడ నుంచి కోల్‌కతాకు..

వివరణాత్మక షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు వెళ‌తారు.

 

కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి, నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి తిరిగి బయల్దేరతారు. సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఇసుక క్వారీపై ధ్వజమెత్తిన టీ సుండుపల్లె మండలం రైతులు
ఈరోజు టి సుండు పల్లి మండలంలో పెద్దబలిజ పల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ...
By Benguluri Madhubabu 2026-03-22 07:34:19 0 262
Telangana
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు
మంచిర్యాల: దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. గురువారం జగిత్యాల జిల్లాలో 44.4...
By Pinnehasan Odela 2026-04-19 15:55:15 0 304
Business & Finance
Meghalaya Tourism Gears Up for Monsoon Visitors
Tourism stakeholders in Meghalaya are strengthening safety measures and upgrading visitor...
By Navya Sree 2026-07-02 07:49:45 0 48
Andhra Pradesh
సీసీ రోడ్డు ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే !!
కర్నూలు : పాణ్యం :  కల్లూరు అర్బన్, 19వ వార్డ్ మారుతి నగర్ లో సీసీ రోడ్డు,జోహారాపురం మెయిన్...
By Hari Krishna 2025-12-24 14:30:09 0 241
BMA
“భారతదేశంలో పెరుగుతున్న Petrol & Diesel ధరలు – ప్రజలపై భారమవుతున్న ఖర్చులు!”
“శుభోదయం… ఈ రోజు మీ కోసం ఒక ముఖ్యమైన వార్త! దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు...
By Thokala Sivaji 2026-03-28 03:23:50 0 678
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com