రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.

0
65

రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం

ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

 

విజయవాడ నుంచి కోల్‌కతాకు..

వివరణాత్మక షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు వెళ‌తారు.

 

కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి, నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి తిరిగి బయల్దేరతారు. సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం.
  40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం...
By Pagadala Venkateswar 2026-05-19 05:33:56 0 38
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 134
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 704
Andhra Pradesh
23వ తారీకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
ప్రకటన   విషయం: రేపు తేది 23.01.2026న శ్రీ పంచమి పురస్కరించుకుని శ్రీ కనక దుర్గ అమ్మవారు...
By Rajini Kumari 2026-01-22 12:27:23 0 170
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 11:11:28 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com