రేపు కోల్‌కతాకు సీఎం చంద్రబాబు... బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరు.

0
104

రేపు ఉదయం విజయవాడ నుంచి కోల్‌కతాకు బయల్దేరనున్న ముఖ్యమంత్రి

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్న కార్యక్రమం

ప్రమాణ స్వీకారం అనంతరం కోల్‌కతా నుంచి నేరుగా హైదరాబాద్‌కు పయనం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

 

విజయవాడ నుంచి కోల్‌కతాకు..

వివరణాత్మక షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు వెళ‌తారు.

 

కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి, నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి తిరిగి బయల్దేరతారు. సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చిత్తూరు జిల్లాలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి పర్యటన
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా...
By Benguluri Madhubabu 2026-02-06 04:46:56 0 248
Andhra Pradesh
బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న...
By Kothuru Murali 2026-03-17 07:09:50 0 168
Telangana
ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్ భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్...
By Gujile Ramu 2026-05-14 01:28:24 0 106
Telangana
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-29 11:54:40 0 176
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com