హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!

0
76

హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశ విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రెండో దశలోని ఏడు మార్గాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. పీపీపీ మోడల్‌పై కేంద్రం గతంలో లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ప్రాజెక్టు ప్రభుత్వ పరమవడంతో పరిష్కారమైనట్లు రాష్ట్రం భావిస్తోంది.

‎హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న వంద శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. రెండో దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.

‎గతంలో మెట్రో రెండో దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో, రెండో దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలిక పెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో రెండో దశ ఎ, బి భాగాల్లోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే

‎ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది

Search
Categories
Read More
Andhra Pradesh
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల...
By John Baji 2026-01-02 14:28:21 0 175
Telangana
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
By Gujile Ramu 2026-05-15 08:34:06 0 51
Andhra Pradesh
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-03-09 08:07:34 0 110
Andhra Pradesh
అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:21:12 0 111
Andhra Pradesh
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు...
By Pagadala Venkateswar 2026-01-20 11:10:24 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com