ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం

0
84

కరీంనగర్ జిల్లా 

‎   బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు నిన్నా బండి సంజయ్ కుమార్ గారు కే.టి. రామారావు (కేటీఆర్) గారిపై చేసిన అవమానకర మరియు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.

‎>ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం

‎. >కేటీఆర్ గారు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి.

‎>హైదరాబాద్‌లో భూకబ్జా వ్యవహారాలపై కేటీఆర్ గారు చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక, అలాగే రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై స్పందించలేక, బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన అసహనాన్ని, బలహీనతను బయటపెడుతోంది.

‎>కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై బండి సంజయ్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసినప్పటికీ, కేటీఆర్ గారు ఎప్పుడూ ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు. కానీ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరం.

‎>హిందూ ధర్మం, శ్రీ రాముడు, హనుమంతుడు పేర్లు ఎత్తుకునే బండి సంజయ్ వంటి నాయకుడు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం. >రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

‎>మేము నిజమైన హిందువులం. మా సంస్కృతి గౌరవాన్ని, నియంత్రణను, నైతిక విలువలను నేర్పుతుంది. మేము దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, భక్తితో పూజిస్తాము.

‎>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, అలాగే కరీంనగర్ మాజీ ఎంపీగా బండి సంజయ్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు.

‎>ఇలాంటి బాషా తనపై వాడితే ఎలా ఉంటుందో బండి సంజయ్ ఆలోచించాలి.

‎>వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను చూపిస్తూ తెలంగాణలో కూడా అదే ఫలితం వస్తుందని మీరు చెప్పడం వాస్తవానికి సరిపోదు. 

‎>ప్రతి రాష్ట్రానికి తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిరుచులు ఉంటాయి.

‎>తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైందని స్పష్టంగా కనిపిస్తోంది. 

‎>ఇక్కడ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, స్పష్టమైన దిశ, బలమైన నాయకత్వం కనిపించడంలేదు. 

‎>ఈ పరిస్థితుల్లో కేవలం ఇతర రాష్ట్రాల విజయాలను చూపించడం ద్వారా ఇక్కడ గెలుస్తామని చెప్పడం మీ బుద్ధి తక్కువ తనం 

‎>ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారి పనితీరు, నిబద్ధత, ప్రజాసేవ ఆధారంగా నిర్ణయిస్తారు. 

‎>తెలంగాణలో బీజేపీకి అలాంటి బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వం ఉందా? ప్రజల సమస్యలపై మీరు ఎక్కడ, ఎలా పోరాడుతున్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పగలరా?

‎>ఇక్కడి రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకోకుండా, ఊహాజనిత అంచనాలపై ఆధారపడి మాట్లాడడం కంటే మీరు చేసేది ఏమి లేదు 

‎>తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారనే పేరే గానీ, రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన చరిత్ర కనిపించడంలేదు. 

‎>తెలంగాణపై అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఒక్కరు లేచి గళం విప్పలేకపోవడం వారి రాజకీయ బలహీనతను బయటపెడుతోంది.

‎>కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. >యూరియా కొరత వంటి అత్యవసర సమస్యలపై కేంద్రంతో చర్చించి పరిష్కారం తీసుకురావడం కూడా చేయలేకపోయారు. >పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, బీజేపీ నాయకులు నిశ్శబ్దంగా ఉండటం బాధ్యతారాహిత్యం.

‎>రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సిన చోట, బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల సమస్యలపై పోరాడే ధైర్యం, నిబద్ధత ఎక్కడా కనిపించడం లేదు.

‎>ఇక్కడ బీజేపీ నాయకత్వం ప్రజలకు ఉపయోగపడే శక్తిగా కాదు, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా కూడా కనిపించడం లేదు.

‎> బండి సంజయ్ గారు పగటి కళ్ళకు కనడం అపి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండి, 

‎>కేటీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి మరియు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తన్నాము

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 152
Andhra Pradesh
మాచ్ ఆరో తారీకు నుంచి 8వ తారీకు వరకు 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభాభిషేకం పటిష్ట ఏర్పాట్లు
*ప్ర‌చుర‌ణార్థం* *24-02-2026*   *భక్తి వైభవం, వైదిక ఘనతలతో కుంభాభిషేకం*  ...
By Rajini Kumari 2026-02-24 11:47:39 0 142
Telangana
లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Avunoori Mahesh 2026-05-08 15:03:19 0 142
Andhra Pradesh
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
By Benguluri Madhubabu 2026-03-20 11:13:09 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com