ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.

0
102

లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి

టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన

కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు

ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అమలు చేసిన '100 రోజుల ప్రణాళిక'తో ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించాయని, ఇది ప్రభుత్వ విద్యారంగంలో ఒక నూతన అధ్యాయమని శాసనమండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు కొనియాడారు. ఈ విజయాలను పురస్కరించుకుని ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 60 మంది విద్యార్థినీ, విద్యార్థులను విజయనగరంలో ఆదివారం ఘనంగా సత్కరించారు.

 

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డా. వేపాడ చిరంజీవిరావు ఆధ్వర్యంలో ఈ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా టాపర్లుగా నిలిచిన ప్రతి విద్యార్థికి వెయ్యి రూపాయల నగదు బహుమతి, మెరిట్ సర్టిఫికేట్ అందజేశారు. విద్యార్థుల విజయానికి కారణమైన వారి తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా శాలువాలతో గౌరవించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా విప్ వేపాడ మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. "గత ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత నమోదైతే, ఈ ఏడాది వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం కావడంతో అది 85.25 శాతానికి పెరిగింది. ఇది చిన్న విషయం కాదు," అని ఆయన పేర్కొన్నారు. 

 

"ప్రధాన పత్రికల మొదటి పేజీ ప్రకటనలు కేవలం కార్పొరేట్ సంస్థలకే సొంతం కాదు, మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకూ ఆ హక్కు ఉందని మీరు నిరూపించారు" అంటూ విద్యార్థులను ఆయన ఉత్సాహపరిచారు. ద్విభాషా క్వశ్చన్ బ్యాంకులు, 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికి వందనం’ వంటి పథకాలు ఈ విజయానికి ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు.

 

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అందించిన సంక్షేమ పథకాలు ఒకవైపు, పక్కా కార్యాచరణ ప్రణాళిక, పర్యవేక్షణ మరోవైపు సమన్వయంతో సాగడం వల్లే పదో తరగతిలో ఇంతటి ఘన విజయం సాధ్యమైందని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇదే ఒరవడిని కొనసాగించాలని కోరారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి...
By Pagadala Venkateswar 2026-02-07 07:01:02 0 189
Andhra Pradesh
పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో,...
By Kothuru Murali 2026-06-09 13:44:00 0 70
Andhra Pradesh
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు...
By Kola Kirankumar 2026-03-31 17:43:25 0 407
Telangana
దొంగతనల నివారణకు ప్రత్యేక దృష్టి : ఏసీపీ కిరణ్ కుమార్
మంచిర్యాల జిల్లా : బంగారు ఆభరణాల వ్యాపారులు,గోల్డ్ లోన్ సంస్థల సిబ్బంది అప్రమత్తంగా...
By Avunoori Mahesh 2026-05-08 11:50:58 0 192
Andhra Pradesh
పొలం పిలుస్తుంది - వరి నారుమళ్లపై అవగాహన...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల వ్యవసాయ శాఖ ఆధరవ్యంలో నిర్వహిస్తున్న దాళ్వా...
By BABJI DADALA 2025-12-24 15:45:15 0 370
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com