జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
91

 

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

04-05-2026 Mon 07:39 | Both States

Chandrababu Naidu Congratulates JEE Mains Toppers

100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు

ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు

నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం

జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

వివరాల్లోకి వెళ్తే, నారాయణ విద్యాసంస్థల్లో చదివి 100 పర్సంటైల్ సాధించిన మహిత్ ఆంధ్రప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే తెలంగాణ నుంచి సాయి రిత్విక్‌రెడ్డి, మహేశ్వరి, భవితేష్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులతో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.

Search
Categories
Read More
Lakshdweep
Lakshadweep Advances Welfare and Digital Governance
Lakshadweep is strengthening public service delivery by expanding digital governance and...
By Fathima Safa 2026-06-29 07:49:16 0 64
Business & Finance
Vehicle Loans for Easy and Affordable Dream Car Finance
Vehicle loans help individuals and businesses purchase cars, bikes, commercial vehicles, and...
By Navya Sree 2026-07-23 06:19:58 0 27
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన...
By Kothuru Murali 2026-02-20 09:21:37 0 145
Andhra Pradesh
Chandrababu Naidu: విజయవాడ లోక్ భవన్ లో 'ఎట్ హోం'... హాజరైన చంద్రబాబు, పవన్, లోకేశ్.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆధ్వర్యంలో 'ఎట్ హోమ్' వివిధ రంగాల ప్రముఖులు, స్వాతంత్య్ర...
By Pagadala Venkateswar 2026-01-26 12:23:38 0 183
Telangana
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను...
By Sidhu Maroju 2026-03-05 06:44:04 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com