తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.

0
56

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన

ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్

రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌ లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి అంబులెన్స్‌ లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన అంబులెన్స్, అప్పటికే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

 

ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

 

సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్
సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ బాపట్ల: ప్రముఖ...
By Gadiyapudi Narendra 2026-01-03 16:23:53 0 226
Andhra Pradesh
YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం.
ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని సీబీఐని ప్రశ్నించిన ధర్మాసనం ఎవరిని విచారించాలనుకుంటున్నారో...
By Pagadala Venkateswar 2026-01-21 06:26:52 0 152
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-13 03:20:41 0 108
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 130
Andhra Pradesh
ఇంటర్ పరీక్షలు పై పోలీస్ డేగకను: ఎస్పీ
అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట...
By Pagadala Venkateswar 2026-02-25 08:50:42 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com