"కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|

0
257

హైదరాబాద్‌ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నేతలతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడం, త్వరలో ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు నూతన కమిటీల నిర్మాణం వంటి కీలక అంశాలపై ఆయన విస్తృతంగా చర్చించారు. 

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి విజయాలు సాధించిన నేతలను అభినందించిన కేటీఆర్, అదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ శక్తిని పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Kerala Startup Mission Expands Support for Innovation and Entrepreneurs
The Kerala Startup Mission (KSUM) is strengthening the state's start-up ecosystem by expanding...
By Navya Sree 2026-07-04 06:03:42 0 52
Telangana
బచపన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని బచ్‌పన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-12 16:26:46 0 136
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 171
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
By Pagadala Venkateswar 2026-03-24 03:30:15 0 154
Andhra Pradesh
మదనపల్లి: సర్టిఫికెట్ కోసం దివ్యాంగురాలి కష్టాలు.
బుధవారం, 12 ఏళ్ల దివ్యాంగురాలి తండ్రి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి అధికారులపై ఆరోపణలు చేశారు....
By Pagadala Venkateswar 2026-06-04 06:26:39 0 64
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com