ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.

0
60

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు

ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం

ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్

పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లోని స్టార్ హోటళ్లలో భోజనం ప్రియం కానుంది. పెరిగిన ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

 

అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ఒకేసారి రూ.993 పెంచడం హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో నష్టాలను ఎదుర్కొంటున్నామని, తాజా గ్యాస్ ధరల పెంపుతో నిర్వహణ మరింత కష్టంగా మారిందన్నారు.

 

ఈ పరిస్థితుల్లో హోటల్ పరిశ్రమను, దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్వామి పేర్కొన్నారు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెంచాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.

Search
Categories
Read More
Telangana
"మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా...
By Sidhu Maroju 2026-05-19 13:25:19 0 73
Telangana
రామాయంపేట: హక్కులపై అవగాహన కలిగి ఉండాలి'
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా...
By Katiyala JeevanRaj 2026-04-30 08:06:17 0 127
Andhra Pradesh
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అన్న క్యాంటీన్ ఈరోజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్
🌹🌹🌹 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు సామాన్యులకు, శ్రామికులకు ఆకలి తీర్చడానికి అత్యంత ప్రజాధరణ...
By Chennaiah Kati 2026-04-15 07:32:25 0 161
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 162
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com