హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి

0
126

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‎ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

‎సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.

‎బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్, వారికి ధైర్యం చెబుతూ తాము అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

‎ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కేటీఆర్ తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

‎అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణం గారితో స్వయంగా మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. 

‎బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

‎మృతుల దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని తన బృందాన్ని కేటీఆర్ ఆదేశించారు.

‎తమ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇలా రోడ్డు ప్రమాదాల్లో పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని కేటీఆర్ గారు భరోసా కల్పించారు.

Search
Categories
Read More
Business & Finance
Maruti Suzuki Expands Manufacturing at Kharkhoda Plant
Maruti Suzuki has commenced commercial production at the second plant of its Kharkhoda...
By Navya Sree 2026-07-04 08:27:12 0 73
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 2K
Andhra Pradesh
ఆటలతో ఉద్యోగులలో మానసిక స్థైరం: కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-10 13:55:51 0 227
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:46:09 0 477
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:23 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com