చందిప్ప గ్రామ రైతుకు ఉత్తమ రైతు అవార్డు

0
399

శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోసాడ శేఖర్ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ సిల్క్ బోర్డు ఉత్తమ రైతు అవార్డు లభించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎంపికైన ముగ్గురు రైతుల్లో ఒకరుగా నిలిచిన శేఖర్ రెడ్డి గారు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టు పురుగుల పెంపకం (సెరికల్చర్) రంగంలో నిరంతర కృషి చేస్తూ, సొంతంగా చాకి నిర్వహిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు. ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ, నాణ్యమైన మల్బరి ఆకులను ఉత్పత్తి చేసి పట్టు పురుగుల పెంపకంలో ఉన్నత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కృషి ద్వారా స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా, ఇతర రైతులకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.

శేఖర్ రెడ్డి గారి కృషిని గుర్తించిన సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యులు డా. వినోద్ కుమార్, డా. రాఘవేందర్‌లు ఈ అవార్డును అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

అంతేకాకుండా, పరిగి, కొండంగల్, వికారాబాద్ ప్రాంతాల నుండి కొత్తగా పట్టు పురుగుల పెంపకం ప్రారంభించిన రైతులకు శేఖర్ రెడ్డి గారు మల్బరి సాగు, పురుగుల సంరక్షణ, వ్యాధి నివారణ వంటి అంశాలపై విలువైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఆయన అనుభవం కొత్త రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.

ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రైతులకు, ముఖ్యంగా యువతకు ఇది ప్రేరణగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి రంగంలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పట్టు పురుగుల పెంపకం వంటి రంగాలలో మంచి ఆదాయం సాధించవచ్చని సూచించారు. మన మండలంలో చేనేతకు సంబంధించిన యువకులు, రైతులు ఈ రంగాన్ని నేర్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

చివరిగా, ఈ విజయాన్ని సాధించడంలో ఏడి ముత్యాలు గారు మరియు నాగరత్నం మేడం అందించిన సహకారం ఎంతో కీలకమని శేఖర్ రెడ్డి గారు తెలిపారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 848
Andhra Pradesh
మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు...
By Boiena Rajesh 2026-04-19 04:04:51 0 140
Andhra Pradesh
పుంగనూరుకు 1,442 పక్కా ఇళ్ల మంజూరు: ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశం
అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేశ్‌రెడ్డి మంగళవారం పుంగనూరులో గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష...
By Kothuru Murali 2026-06-24 16:43:58 0 46
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో...
By Kothuru Murali 2026-03-22 06:38:41 0 160
Telangana
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్...
By Ponnala Srinivasrao 2026-07-05 01:12:39 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com