ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!

0
64

599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్

ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం

పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్

రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది సాధించిన 81.14 శాతంతో పోలిస్తే ఈసారి ఫలితాలు 4.15 శాతం మెరుగుపడటం గమనార్హం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.90 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 82.68 శాతం మంది బాలురు పాసయ్యారు. అంటే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణతను సాధించారు. అంతేగాక‌ పాసైన వారిలో 83.69శాతం మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులవడం విశేషం.

 

 రాష్ట్ర టాపర్‌గా విశాఖకు చెందిన కె. జ్ఞానేశ్వరి

ఈ ఫలితాల్లో విశాఖపట్నానికి చెందిన కె. జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించారు. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ ఎన్ఏడీలోని శ్రీచైతన్య స్కూల్‌లో చదివిన జ్ఞానేశ్వరి, కేవలం ఒక్క మార్కుతో 600 మార్కుల లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. ఆంగ్లంలో ఆమెకు ఒక్క మార్కు తగ్గింది.

 

జ్ఞానేశ్వరి తండ్రి కె. శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి భారతి విశాఖ నేవల్ డాక్‌యార్డులో ఉద్యోగినిగా ఉన్నారు. అయితే, ఇంతటి ఘన విజయం సాధించడానికి ముందు జ్ఞానేశ్వరి ఒక పెద్ద సవాలును ఎదుర్కొన్నారు. పరీక్షలకు ముందు టైఫాయిడ్ బారిన పడటంతో ఆందోళన చెందినా, ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరయ్యారు. పట్టుదలతో చదివి అద్భుతమైన మార్కులు సాధించారు. భవిష్యత్తులో ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకుని, డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని జ్ఞానేశ్వరి తెలిపారు.

 

కాగా, గతేడాది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. అయితే, ఈ ఏడాది ఆ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. అత్యధికంగా 599 మార్కులే వచ్చాయి.

Search
Categories
Read More
Bharat Aawaz
“వేడెక్కుతున్న వాతావరణం 🌅🥵⚠️”
ఇప్పటి తాజా సంచలన వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా మరోసారి వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులు...
By Thokala Sivaji 2026-03-24 06:15:26 0 679
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు....
By Kothuru Murali 2026-03-16 07:00:46 0 121
Andhra Pradesh
శ్రీకాకుళం: మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం
శ్రీకాకుళం పట్టణ తాగునీటి సరఫరా కేంద్రం ఆవరణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
By Manda Ramkumar 2026-03-28 10:36:07 0 265
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 323
Business
Advancing postal cooperation for a more connected world!
Secretary (Posts), Ms. Vandita Kaul led the Indian delegation at the Pan African Postal Union...
By Bharat Aawaz 2025-07-02 17:43:35 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com