ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.

0
71

ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం

'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల

ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్' (టీబీడీఏ) విధానంలో సుమారు రూ.1,000 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

 

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 323 ఆసుపత్రులు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకున్నాయి. బకాయిల చెల్లింపు పురోగతిపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు.

 

ప్రస్తుతం 873 ప్రైవేటు ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం రూ.2,044 కోట్లు బకాయి పడింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.1,000 కోట్ల బిల్లుల పరిశీలన పూర్తి చేసి, చెల్లింపులు జరుపుతోంది. ఈ విధానంలో, ప్రభుత్వం తరఫున ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్‌సీ) నిధులు చెల్లిస్తుంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో వార్షిక వడ్డీని ముందుగానే మినహాయించి, మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తుంది.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు మొత్తం రూ.5,556 కోట్లు చెల్లించింది. గత వైకాపా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,403 కోట్ల బకాయిలను కూడా ఇందులో భాగంగానే చెల్లించడం గమనార్హం. తాజా చెల్లింపులతో కలిపి ఆసుపత్రులకు మరింత ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
అల్లూరి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసులు.
మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని...
By Pagadala Venkateswar 2026-05-08 05:17:04 0 66
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 84
Andhra Pradesh
Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని...
By Pagadala Venkateswar 2026-03-21 06:17:27 0 133
Telangana
విద్యుత్ సరఫరా నిలిపివేత
చిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం...
By Nookapangu Manikanta 2026-05-13 14:33:50 0 77
Andhra Pradesh
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-15 05:49:44 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com