శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.

0
108

శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు

పోలీసుల పనితీరును ట్విట్టర్ వేదికగా ప్రశంసించిన మంత్రి లోకేశ్

అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన వైనం

ప్రతి మహిళ ఫోన్‌లో శక్తి యాప్ ఉండాలని సూచించిన లోకేశ్

అర్ధరాత్రి విజయవాడ నుంచి ఇంటికి వెళ్తుండగా ఘటన

శక్తి యాప్, పోలీసుల అప్రమత్తత ఓ యువతిని అర్ధరాత్రి ఆపద నుంచి సురక్షితంగా బయటపడేశాయి. అనుమానాస్పదంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ బారి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థినిని కాపాడిన మంగళగిరి గ్రామీణ పోలీసులను మంత్రి నారా లోకేశ్ అభినందించారు. మహిళల భద్రతకు టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. నంబూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అర్ధరాత్రి బెంగళూరు నుంచి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో ఆటో డ్రైవర్ బొమ్మనపల్లి ఫణీంద్రకుమార్ వాహనం వేగాన్ని తగ్గించి, అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతి, వెంటనే తన ఫోన్‌లోని శక్తి యాప్ ద్వారా ఎమర్జెన్సీ బటన్ నొక్కారు.

 

అలర్ట్ అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు, ఎస్సై వెంకట్ నేతృత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. యాప్ ద్వారా వచ్చిన లైవ్ లొకేషన్ ఆధారంగా ఆటోను కాజా సమీపంలో అడ్డగించి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. యువతిని సురక్షితంగా ఆమె ఇంటికి చేర్చారు.

 

ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. "అర్ధరాత్రి యువతిని కాపాడిన మంగళగిరి పోలీసులకు అభినందనలు. శక్తి యాప్ ద్వారా సమాచారం రాగానే వేగంగా స్పందించి ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. సోదరీమణులారా, మీ ఫోన్లలో శక్తి యాప్‌ను తప్పక ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రాణాలను కాపాడుతుంది" అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై గుంటూరు డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*   *గేట్స్...
By Rajini Kumari 2025-12-16 07:07:54 0 237
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 152
Andhra Pradesh
పుంగనూరు: సింహ వాహనంపై మృత్యుంజయే స్వర స్వామి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని శ్రీ అభిష్టద మృత్యుజయేశ్వర స్వామి...
By Kothuru Murali 2026-04-23 15:10:30 0 103
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 434
Telangana
బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది...
By Thativar Shivaji 2026-04-19 12:24:20 0 282
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com