కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
116

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం (ఆర్చ్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ఒక ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ సౌందర్యవృద్ధితో పాటు, స్థానికులకు గర్వకారణంగా ఈ ఆర్చ్ నిలుస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

స్వంత నిధులతో ఈ గ్రామ ప్రవేశ ద్వారాన్ని నిర్మించిన రామ్ అఖిల్‌ను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంపీ గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్ రవి మరియు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ఫిర్యాదు
సింగర్ మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ ప్రొడ్యూసర్...
By Ponnala Srinivasrao 2026-04-19 06:12:08 0 86
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గడ్డి మందు తాగిన యువకుడు మృతి
పుంగనూరు నియోజక వర్గం, చౌడేపల్లి మండలం, చిట్టిరెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న సతీష్ (25)...
By Kothuru Murali 2026-01-29 08:54:41 0 135
Andhra Pradesh
మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో...
By Pagadala Venkateswar 2026-02-10 04:19:26 0 113
Telangana
నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈరోజు...
By Avunoori Mahesh 2026-05-14 10:02:00 0 100
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com