కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
117

 

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం (ఆర్చ్)ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ఒక ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ సౌందర్యవృద్ధితో పాటు, స్థానికులకు గర్వకారణంగా ఈ ఆర్చ్ నిలుస్తుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.

స్వంత నిధులతో ఈ గ్రామ ప్రవేశ ద్వారాన్ని నిర్మించిన రామ్ అఖిల్‌ను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంపీ గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్ రవి మరియు ఇతర ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తల్లితండ్రులను దైవంగా భావించాలి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
 యువత తల్లిదండ్రులను దైవంలా భావించి వారి ఆశీస్సులతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలకు...
By Jagadeesh Babu 2026-05-20 09:34:20 0 77
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్ర్గం : కోళ్ల మరణాల సంభవిస్తే ఈ నెంబర్లను సంప్రదించాలి
అన్నమయ్య జిల్లా, సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ...
By Kothuru Murali 2026-02-09 07:34:11 0 118
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ప్రజా వేదిక పరిష్కారం ప్రధాన ఉద్దేశం కార్యక్రమం చేపట్టినారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ: 29.12.2025* _*//“ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:22:59 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com