రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...

0
100

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాసరావు, తెలంగాణ మలిదిశ ఉద్యమ నేత రాయపూడి వెంకటనారాయణలు శనివారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పూజల అనంతరం నాగు బండి వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
హైడ్రా కమిషనర్ మూడు గంటల్లోనే మాట మార్చారు: దాసోజు శ్రవణ్
రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషర్లు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించిందన్న బీఆర్ఎస్ నేత ‎తర్వాత మూడు...
By Ponnala Srinivasrao 2026-05-06 03:47:52 0 83
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
By Rajini Kumari 2026-02-20 14:42:15 0 117
Telangana
BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్
ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల...
By Krishna Balina 2026-01-08 09:25:04 0 196
Telangana
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులు
ఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి...
By Vadla Egonda 2025-07-15 05:51:03 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com