చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం
చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :-
జి కోటేశ్వరరావు ఆగ్రహం
విజయవాడ నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మాఫియా అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్లో కంచర్ల భార్గవ్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ (AIYF) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం లో జి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. నగరంలో మద్యం విక్రయాలు మితిమీరిపోవడం వల్ల ఎంతోమంది యువత ప్రాణాలు బలికావడమే కాకుండా, అనేక కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే మద్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసన సెగ.. సమరశంఖం:
ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, మాఫియాల అరాచకాలకు వ్యతిరేకంగా AIYF పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ప్రకటించారు.
ఏప్రిల్ 30న నిరసన: మెడికల్ మాఫియాను అరికట్టాలనే డిమాండ్తో ఏప్రిల్ 30న విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (GGH) వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
మే 3న జెండా ఆవిష్కరణ: AIYF 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మే 3న నగరంలోని అన్ని డివిజన్లలో ఘనంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్యం, మెడికల్ మాఫియాలను అదుపు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీరం రవికుమార్, ఎస్. రాము, ఐ. ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, షైనీ తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz