చిత్తవుతున్న యువత వీధిన పడుతున్న కుటుంబాలు మద్యం మాఫియా పై జి కోటేశ్వరరావు ఆగ్రహం

0
129

 చిత్తవుతున్న యువత.. వీధిన పడుతున్న కుటుంబాలు: మద్యం మాఫియాపై :- 

జి కోటేశ్వరరావు ఆగ్రహం

 

 

విజయవాడ నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం మాఫియా అరాచకాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని దాసరి భవన్‌లో కంచర్ల భార్గవ్ అధ్యక్షతన జరిగిన ఏఐవైఎఫ్ (AIYF) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం లో జి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. నగరంలో మద్యం విక్రయాలు మితిమీరిపోవడం వల్ల ఎంతోమంది యువత ప్రాణాలు బలికావడమే కాకుండా, అనేక కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే మద్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

నిరసన సెగ.. సమరశంఖం:

ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ, మాఫియాల అరాచకాలకు వ్యతిరేకంగా AIYF పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ప్రకటించారు.

ఏప్రిల్ 30న నిరసన: మెడికల్ మాఫియాను అరికట్టాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 30న విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (GGH) వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

మే 3న జెండా ఆవిష్కరణ: AIYF 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మే 3న నగరంలోని అన్ని డివిజన్లలో ఘనంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్యం, మెడికల్ మాఫియాలను అదుపు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీరం రవికుమార్, ఎస్. రాము, ఐ. ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, షైనీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్...
By Avunoori Mahesh 2026-05-06 15:06:59 0 121
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 161
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 304
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com