స్లగ్: ఘనంగా భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ లో వార్షికోత్సవం...

0
184

స్థలం:చీరాల

చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ చుక్క గంగాధర్ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చూడముచ్చటగా నృత్యాలు ప్రదర్శించారు.ముఖ్య అతిథులుగా చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,చీరాల ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో గోపికృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులని చూడగానే చూడముచ్చటగా ఉన్నారని నేటి చిన్నపిల్లలే భవిష్యత్ తరానికి పౌరులని తల్లిదండ్రులు వారిని మంచి నడవడికల్లో నడిచేలా ప్రేరణ చేయాలని కోరారు. ప్రైమరీ పాఠశాల నుంచే తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మెలగాలని పిల్లలు ఆలోచనలు అడిగి తెలుసుకోవాలని వారు ఎలా నడుచుకుంటున్నారు అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. పిల్లలు చదువులోనే కాకుండా ఏ రంగాన్ని అధిగమించాలనుకుంటున్నారో వారికి భరోసా కల్పించి, ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతగానో ఉంటుందని వారు వివరించారు.పిల్లలని వారి అనుకున్నది సాధించేవరకు అందరూ పిల్లలకు భరోసాగా ఉండి నిరుత్సాహం ప్రదర్శించకుండా వారికి ధైర్యం చెప్పి పిల్లలు ఏ ఇబ్బందికి గురికాకుండా చూడాలని కోరారు. తను ఆహ్వానించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు మొదటి నుంచి ఎక్కువకాలం ఉపాధ్యాయులతోనే గడుపుతారని విద్యార్థులు ఎలా మెలగాలో విషయాన్ని ఎలా రానించాలో ఉపాధ్యాయులు పై ఎంతగానో ఉందని, ఉపాధ్యాయులు చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు చదువులో గొప్ప స్థాయి చేరుకునేలా చదువు నేర్పించాలని వివరించారు. మైనర్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు అవగాహన కలిగించి జరుగుతున్న ప్రమాదాలు గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో నృత్యాలు,డాన్స్ కార్యక్రమాలు నిర్వహించి,పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు గిఫ్ట్స్ బహుకరణ చేసి, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
  తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్...
By Pagadala Venkateswar 2026-02-22 08:46:07 0 144
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 99
Andhra Pradesh
రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది....
By Pagadala Venkateswar 2026-02-17 07:14:22 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com