వివాహిత అనుమానాస్పద మృతి

0
118

భారత్ ఆవాజ్ 

సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ 

 

 

వివాహిత అనుమానాస్పద మృతి

 

 

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుండి తరలించడానికి వీల్లేదంటూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.పోలీసులను అడ్డుకుంటూ ఘటన స్థలంలోనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు...
By Sunka Santhosh 2026-04-29 17:04:45 0 132
Andhra Pradesh
చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర...
By Pagadala Venkateswar 2026-02-19 10:04:00 0 122
Telangana
"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్,...
By Sidhu Maroju 2026-04-22 15:38:21 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com