వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం

0
158

*ప్రెస్ నోట్*

 

*తేదీ: 23-04-2026*  

*విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్య... ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం...నలుకుర్తి రమేష్.*

 

*విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ పార్క్, టెన్నేటి పార్క్, ఉడా పార్క్, సెంట్రల్ పార్క్* లాంటి ప్రధాన పార్కుల్లో ఉదయం, సాయంత్రం ప్రజారోగ్యం కోసం నడిచే సామాన్య ప్రజలపై ఏడాదికి ₹720 "నడక పన్ను" విధించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత హాస్యాస్పదం, అప్రజాస్వామికం, దుర్మార్గం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

 

*ప్రజల ఆరోగ్యంపై పన్నా?*  

డాక్టర్లు, ప్రభుత్వమే "రోజూ నడవండి, ఆరోగ్యంగా ఉండండి" అని ప్రచారం చేస్తుంటే, అదే ప్రభుత్వం ఇప్పుడు ఈ లాంటి చోట్ల నడకపై పన్ను వేయడం దారుణం. షుగర్, బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా దొరికే పార్కుల్లో నడుస్తుంటే, వారి జేబులకు చిల్లు పెట్టడం ఎంతవరకు న్యాయం? 

 

*ఇది ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం*  

ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అయ్యిందని సాకు చూపి, చివరికి ప్రజల నడకపై కూడా పన్ను వేసే దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇది పాలనా వైఫల్యానికి, ఆర్థిక అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం. 

 

*రేపు గాలికి కూడా పన్నేస్తారా?*  

ఈరోజు పార్కులలో నడకకు పన్ను వేసినవారు, రేపు పీల్చే గాలికి, తాగే నీటికి, చివరికి బతికేందుకు కూడా పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజలు ఏరి కోరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, వారి నెత్తిన పన్నుల భారం మోపడం ద్రోహం చేయడమే.

 

*మా డిమాండ్లు:*  

1. విశాఖ కార్పొరేషన్ వెంటనే ఈ "నడక పన్ను" జీవోను ఉపసంహరించుకోవాలి.  

2. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించే బదులు, దానిపై పన్నులు వేసే విధానాలకు స్వస్తి పలకాలి.  

3. ఈ నిర్ణయం వెనుక ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.  

 

 ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 

 

*ఇట్లు*  

*నలుకుర్తి రమేష్*  

*వైయస్సార్సీపి ఎస్సి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*  

*అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా*

Search
Categories
Read More
Business & Finance
Bengaluru Leads India’s Housing Growth Market
Bengaluru has emerged as India’s leading housing growth market in Q2 2026, according to a...
By Navya Sree 2026-07-01 13:15:26 0 83
Telangana
"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై...
By Sidhu Maroju 2026-05-16 17:24:49 0 294
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ గార్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా దోర్నాల మండలానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన...
By Chennaiah Kati 2026-06-25 14:23:07 1 68
Andhra Pradesh
భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.
  భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు   Andhra AP High Court key ruling...
By Pagadala Venkateswar 2026-06-10 05:44:25 0 61
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:11 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com