ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

0
145

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి ఆర్ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి . వలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణం బాధ్యులు బి. గిడ్డయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ 

 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ప్రభుత్వ విద్యను పరిరక్షించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటూ చివరికి కూటమి ప్రభుత్వ హామీలను కూడా మరచిపోయి ప్రభుత్వ విద్యను ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అందజేస్తున్నది అని అందువల్లనే ఏపీఎస్ సిహెచ్ఇ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ 

 నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ( సి హెచ్ ఈ) జీవో నెంబర్: 3 తీసుకోని వచ్చిందని 

 మరో పక్కన ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి 18 వ తారీఖున ప్రైవేట్ కళాశాల ఎక్కడా కూడా బోర్డులను గాని వీడియోల ద్వారా ప్రచారం గానీ విద్యార్థులను కచ్చితంగా ఉత్తీర్ణులు చేస్తాం గాని ఇవ్వకూడదని ప్రవేట్ విద్యాసంస్థలకు ఇంటర్ విద్యా మండలి బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాల పాటించకపోగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు పైగా కమీషనరేట్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ సిహెచ్ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ మార్చి 27వ తారీఖున ఫేక్ కోచింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకుంటాము, అని 

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు తీసుకొని వచ్చారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఓ పక్క ప్రక్షాళన చేస్తున్నామంటూనే మరో పక్కన కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పొరేట్ వేస్తున్నది అందుకు సందేహమే లేదు రాష్ట్రంలోని నకిలీ కోచింగ్ సెంటర్ల పై చర్యలు లేక

  విద్యార్థులను తల్లిదండ్రులని మభ్య పెట్టేందుకు మాత్రమే ప్రొసీడింగ్స్ విడుదల చేస్తూన్నారు అని అన్నారు 

 బైజూస్, ఫిజిక్స్ వాలా,ఎన్నో అనుమతి లేని సెంటర్ ఉన్న జేఈఈ మెయిన్స్ , మెడిసిన్ పేరుతో దోచుకున్న చర్యలు లేవు, అయినా కార్పొరేట్ విద్యకు పరోక్షంగా కూటమి నేతలు ఉతం అందుస్తున్న కూటమి ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామంటూనే మభ్యపెడుతున్నారు, ఇంటర్ విద్యలో మొదటి సంవత్సరం 77% రెండవ సంవత్సరం 81% ఉన్న ఫెయిల్ కూడ అదే కార్పొరేట్ విద్యా సంస్థలో ఉన్న తల్లిదండ్రులకు, బయటకు, చెప్పకుండా ఉన్నారు ప్రాంతీయ ఆర్ఐవోలుగా వ్యవహరిస్తున్న వారు దీన్ని బయట పెట్టవలసిన అవసరం ఉన్న పట్టనట్టు ఉన్నారు, అదే క్రమంలో అడ్మిషన్లు అక్రమంగా చేస్తూ పుస్తకాల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ల మంత్రిగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఇప్పటికి విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులు వేధింపులు గురి చేస్తున్నాయన్నారు విడుదల చేస్తామని చెప్పిన 1200 కోట్లలో కూడా ఇంకా పెండింగ్లో ఉండడం 2024 -2025 విద్యా సంవత్సరానికి చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వ పెద్దల ఆదేశాలు వచ్చి నా విద్యార్థులకు కష్టాలు మాత్రం తప్పలేదు అని అన్నారు అందుకే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిపి పోరాటాలకు సిద్ధమొద్దామని అన్నారు అనంతరం ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సోమన్న, యస్. షాబిర్ భాష, జిల్లా ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, వీరేష్ నగర కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* .. *  విజయనగర చక్రవర్తి...
By Rajini Kumari 2026-01-16 12:42:14 0 169
Telangana
బొలెరో వాహనం బోల్తా.... బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా ధ్వంసం..
   * *బొలెరో వాహనం బార్ధన్ ఏసుకొస్తున్న బోల్తా దగ్ధం... భారత్ అవాజ్ న్యూస్ మహబూబాబాద్...
By Gujile Ramu 2026-05-01 09:46:11 0 161
Andhra Pradesh
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-02 13:02:45 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com