ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|

0
201

సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాణిగంజ్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ఆయన తన పూర్తి మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఎవడబ్బ జాగీరు అని డిపోలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తారని నిలదీశారు.

ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ బస్సులను కూడా సంస్థ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, దీన్ని బిఆర్ఎస్ ప్రోద్బలంగా చిత్రీకరించడం మంత్రుల అవివేకమని తలసాని విమర్శించారు.

సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేశారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-03-31 03:36:35 0 119
Telangana
*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా...
By SivaNagendra Annapareddy 2025-12-13 13:38:31 0 372
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 167
Andhra Pradesh
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై జేసీబీ దాడి: నాయకుల ఖండన.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు...
By Pagadala Venkateswar 2026-05-09 07:56:47 0 73
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com