"అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!

0
259

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. 

అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు నేరానికి వాడిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఈ నెల 21వ తేదీ సాయంత్రం పంచశీల ఎన్క్లేవ్ వద్ద 70 ఏళ్ల వృద్ధురాలు పెద్దిరాజు జానకి దేవి మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుండగా, వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. 

ఈ క్రమంలో గొలుసు తెగిపోవడంతో పాటు వృద్ధురాలి మెడకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరుసటి రోజు మచ్చ బొల్లారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజస్థాన్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి 10 లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

అత్యంత వేగంగా స్పందించి భారీ విలువ గల ప్రాపర్టీని రికవరీ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. వీరబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ జీవన్ కుమార్, కానిస్టేబుల్ రమాకాంత్ మరియు మహిళా కానిస్టేబుల్ యోగితా సింగ్‌లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. 

ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఈ సందర్భంగా సూచించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Andhra Pradesh
జాతీయ రోలర్ స్కేటింగ్లో విశాఖ అమ్మాయి బంగారు పతకం
విజయవాడ  (17-12-2025)   *స్కేటర్ అమృతకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అభినందనలు* ...
By Rajini Kumari 2025-12-17 09:46:01 0 255
Telangana
ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్...
By Avunoori Mahesh 2026-06-14 10:00:28 0 182
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...
By Gadiyapudi Narendra 2025-12-28 16:34:39 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com