గ్రామ సంఘాల సహాయకులకు(VOA) స్మార్ట్ ఫోన్లు పంపిణీ

0
286

గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు – VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

నందిగామలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఫోన్ల అందజేత..

నందిగామ, బుధవారం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సంఘాల సహాయకులకు (VOAలు) స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నాడు నందిగామ పట్టణంలోని రైతుపేట ఓసీ క్లబ్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై కూటమి నేతలతో కలిసి VOAలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతికత ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా గ్రామ సంఘాల కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో VOAల పాత్ర ముఖ్యమని, వారికి అందిస్తున్న ఈ సౌకర్యాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న VOAలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన, మండల సమైక్య అధ్యక్షులు, మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల...
By Sunka Santhosh 2026-06-18 19:22:55 0 128
SURAKSHA
Mithra T., IAS: Transforming Governance with Vision & Integrity
The Journey begins "Good governance is not about exercising...
By Fathima Safa 2026-07-15 06:23:55 0 73
Telangana
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం...
By Ponnala Srinivasrao 2026-05-16 02:51:52 0 141
Bharat Aawaz
RTI – A Journalist's Greatest Tool for Truth
In a time when information is power, the Right to Information (RTI) Act stands as one of the...
By Bharat Aawaz 2025-07-03 06:52:01 0 2K
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన...
By Pagadala Venkateswar 2026-02-16 12:55:47 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com