Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.

0
93

ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న‌ విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి గత ఆరు నెలల బకాయిలను నేరుగా జమ చేయనున్నారు.

 

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌లకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన రూ.45 కోట్లు.. 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలల కాలానికి సంబంధించినవి. రాష్ట్రంలోని 5,000 మసీదులలో సేవలందిస్తున్న వారికి ఈ బకాయిలను ఒకేసారి క్లియర్ చేశారు. తమ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

ఇఫ్తార్ విందులో మాట్లాడిన సీఎం, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. అమరావతిలో కొత్తగా హజ్‌ హౌస్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అలాగే, కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌ హౌస్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలల్లో ముస్లింల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం కింద రూ.180 కోట్లు అందించామని వివరించారు.

 

రాష్ట్రంలో అర్హులైన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడంతో పాటు వివాహ లైసెన్స్‌ గడువును 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్లకు పెంచామని చంద్రబాబు తెలిపారు. సుమారు 1,500 వక్ఫ్‌ ఆస్తులను సర్వే చేసి వాటిని కాపాడుతున్నామని చెప్పారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
శనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి...
By Kothuru Murali 2026-03-02 04:01:26 0 109
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 536
Telangana
Goal of Purva Chowdary
కొన్ని కథలు నిశ్శబ్దంగా కష్టపడి పైకి వస్తాయి… కానీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ప్రశంసలతో...
By Terli Ashok 2026-01-08 10:57:30 0 212
Andhra Pradesh
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
By Pagadala Venkateswar 2026-01-23 06:23:42 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com