రేవంత్ రెడ్డికి పాడను‎ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే ‎: గాయని మధుప్రియ

0
78

బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ అన్నారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కష్టాలు, రైతుల ఇక్కట్లు మినహా ఈ ప్రభ్యత్వంలో ఇంకేం కనిపించడం లేదని, మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన మధుప్రియ మీడియాతో మాట్లాడారు.

‎భారీ సభలో తాను పాడి రెండేళ్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అవకాశాలు రాలేదని మధుప్రియ తెలిపారు. తాను తెలంగాణ ఉద్యమంలో బాపు కెసిఆర్ తో జర్నీ చేసి ఎన్నో సభల్లో పాడానని, తనను సొంతబిడ్డలా చూసుకుంటారని ఆమె అన్నారు.  రేవంత్ రెడ్డి సభలకు పాడే సమస్య లేదని, ఇక తన ప్రయాణం కెసిఆర్ తోనే అని ప్రకటించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ లో పాడిన అనుభవం, సకల జనుల సమ్మెలో పాల్గొన్న జ్ఞాపకం అన్నీ తనలో తెలంగాణ భావోద్వేగం ఇమిడి ఉందని, ఏ ప్రభుత్వంలోనైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలనే కోరుకుంటున్న అని ఆమె అన్నారు. తనను వివాదాల్లోకి లాగొద్దని మధుప్రియ కోరారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...
By Sidhu Maroju 2026-01-30 06:52:46 0 168
Telangana
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
By Sidhu Maroju 2025-12-17 14:52:09 0 206
Andhra Pradesh
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు.
డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్: సీఎం చంద్రబాబు 29-04-2026 Wed 21:06 | Andhra...
By Pagadala Venkateswar 2026-04-30 04:40:23 0 62
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన...
By Kothuru Murali 2026-02-20 09:25:05 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com