"అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|

0
277

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న మోడిఫైడ్ సైలెన్సర్ల వాడకంపై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో ఏప్రిల్ 20న నియోజకవర్గవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో ప్రధాన జంక్షన్ల వద్ద రణగొణ ధ్వనులు చేస్తూ వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా, భారీగా ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఒక్కరోజే 182 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, వారి నుండి మొత్తం రూ. 2,44,000 జరిమానా వసూలు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 36 మోడిఫైడ్ సైలెన్సర్లను వాహనాల నుండి అక్కడికక్కడే తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. శబ్ద కాలుష్యం కలిగించే ఇలాంటి సైలెన్సర్లు మరియు ప్రెషర్ హారన్ల వల్ల వృద్ధులు, రోగులు మరియు చిన్న పిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వాహనదారులు కేవలం కంపెనీ అందించిన ప్రామాణిక సైలెన్సర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఒకవేళ రెండోసారి కూడా అదే వాహనం మోడిఫైడ్ సైలెన్సర్‌తో పట్టుబడితే, సదరు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరుగా కోర్టుకు పంపుతామని స్పష్టం చేశారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, శబ్ద కాలుష్య నియంత్రణకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కబడ్డీ పోటీల నిర్వహణ:
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ABM చర్చ్ ఆధ్వర్యంలో...
By Hari Krishna 2025-12-27 16:13:13 0 193
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 165
Andhra Pradesh
100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు.
🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్...
By John Baji 2026-01-11 04:34:04 0 211
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-07-14 09:44:00 0 39
Health & Fitness
Smart E-Bike Tech Wins Digital Prize at Eurobike 2026
Avinox has secured the prestigious 2026 Eurobike Award in the Digital Solutions category for its...
By Lokeshwari Panthadi 2026-06-27 04:56:23 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com