విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి

0
173

విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, పి ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు డీఈఓ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లా లోని విద్యారంగా సమస్యలు ని పరిష్కరించడం లో పూర్తి గా విఫలమయ్యారని ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని సమస్యలు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వారు డీఈవో గారికి తెలియజేసే విచారణ చేయమని ఆదేశించిన కానీ డి ఈ ఒ మాత్రం పశ్చిమ ప్రాంతం సమస్యలు పట్టించుకోకుండా కేవలం తన కార్యాలయనీకె పరిమితమయ్యారని ఇక్కడ సమస్యలపై ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓ గారు సమస్యలపై విచారణ చేసి నివేదిక పంపించడం జరుగుతుంది కానీ డీఈవో ఆ నివేదికల ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోడాన్ని చూస్తూ ఉంటే అనుమానాలు కలుగు తున్నాయి యని వారుఅన్నారు. ఇప్పటికైనా ఆర్జెడి మరియు విద్యాశాఖ కమిషనర్ వారు స్పందించి తక్షణమే డిఈ ఒ గారి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఈఓ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహనాయుడు లక్ష్మన్న వెంకటేష్ అశోక్ హేమాద్రి నిఖిల్ విజయ్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే...
By Sidhu Maroju 2026-06-04 11:29:51 0 216
Telangana
బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది...
By Thativar Shivaji 2026-04-19 12:24:20 0 275
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 193
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 176
Andhra Pradesh
Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు.
  Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు...
By Pagadala Venkateswar 2026-02-14 06:03:18 0 440
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com