డేవిడ్ కింగ్ మృతికి బిబిఎస్ కమిటీ ఘన నివాళులు పాలచర్లలో సంతాప సభలో దైవ సేవకుల భావోద్వేగ స్మరణ

0
689

ఇటీవల పరమపదించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ కమిటీ సలహాదారులు, ఆత్మీయులు ఎస్. డేవిడ్ కింగ్ స్మారకార్థం గురువారం పాలచర్లలో ఘన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సంఘానికి చెందిన పలువురు ప్రముఖ దైవ సేవకులు, బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్, బంధువులు, స్నేహితులు పాల్గొని ఆయన సేవలను కృతజ్ఞతతో స్మరించారు.

సభ ప్రారంభంలో డేవిడ్ కింగ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనప్రార్థన నిర్వహించారు. అనంతరం వక్తలు వరుసగా మాట్లాడుతూ ఆయన ఆధ్యాత్మిక నిబద్ధత, సేవా తపన, సౌమ్య స్వభావాన్ని గుర్తుచేశారు. బిక్కవోలు బైబిల్ స్కూల్ రెండవ బ్యాచ్‌లో శిక్షణ పొందిన డేవిడ్ కింగ్, తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు.

బిక్కవోలు బైబిల్ స్కూల్ గ్రాడ్యుయేట్స్ కమిటీ (న్యూ జెనరేషన్ చారిటబుల్ సొసైటీ) అధ్యక్షుడు, జర్నలిస్ట్ గుడివాడ బాబ్జి మాట్లాడుతూ, డేవిడ్ కింగ్ మంచి సలహాదారుడిగా అనేక మందికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. సంఘ సేవలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేసేవారని, యువ దైవ సేవకులను ప్రోత్సహిస్తూ ఆధ్యాత్మికంగా బలపరిచారని చెప్పారు.

దైవ సేవకులు ఎస్. జాన్ (రాజమండ్రి), పి.ఎస్.ఆర్. జయపాల్ (ర్యాలీ), బి. జాషువా (ఏలూరు), ఎం. జాన్ డీన్ (సింగంపల్లి), ఎం. సూర్యారావు (పెదపూడి), ఎం. జయరాజు (తణుకు), బి.సి.హెచ్. కోటేశ్వరరావు (సింగంపల్లి), టి. నతానియేలు (రాయవరం), వి. రాజా విజయ్ కుమార్ (రాజమండ్రి), కమిటీ కోశాధికారి వై. నాగేశ్వరరావు తదితరులు తమ సందేశాల ద్వారా ఆయన సేవలను స్మరించారు. సేవలో వినయం, మాటల్లో మాధుర్యం, వ్యవహారంలో స్పష్టత ఆయన ప్రత్యేక లక్షణాలని పేర్కొన్నారు.

సభలో పాల్గొన్న బిబిఎస్ గ్రాడ్యుయేట్స్, బంధువులు, సహచరులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డేవిడ్ కింగ్ సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని, ఆయన చూపిన ఆధ్యాత్మిక మార్గం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Passbooks: ఏపీ రైతులకు శుభవార్త.. జనవరి 2న వీటిని ఉచితంగా తీసుకోండి!
ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెబుతోంది. ఐతే.. దీని వల్ల రైతులకు కొత్తగా కలిగే...
By Siva Bhaskar 2025-12-27 03:57:17 0 463
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు.
పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, ఉప్పరపల్లి, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో ఆదివారం దివంగత నేత...
By Kothuru Murali 2026-01-18 09:00:39 0 121
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 61
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ...
By Boya Dasthagiri 2026-04-22 09:24:53 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com