బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,

0
145

క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో తేజస్వీ సూర్య దిష్టిబొమ్మని దగ్ధం చేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియని బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగిందని అవహేళనగా మాట్లాడడం, మైక్ ఇచ్చారుగా అని ఏది పడితే అది తెలంగాణ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని, నీలాంటి విలువలేని వాళ్లకు తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరి కాదు,తెలంగాణ రాష్టమేమి ఒక్కరు సాధించిన త్యాగఫలం కాదు. కన్నడ రాష్ట్రo వాడికి తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది. నిజాం పాలకుల నుంచి హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను అన్ని వర్గాలలో అన్ని విభాగాలలో అభివృద్ధి చేయకపోవటంతో ఇక్కడి తెలంగాణ ప్రజలు సాహితీవేత్తలు, కళాకారులు,రాజకీయ నాయకులువిద్యార్థులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి స్వరాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణ బలిదాలకు సిద్ధపడి తెలంగాణను తీసుకొచ్చుకుంటే కుర్రకూతల కూసే బిజెపి ఎంపీ తేజస్వీ సూర్య లాంటి బచ్చగాళ్ళకి తెలంగాణ రాష్ట్రం గురించి ఎలా తెలుస్తుంది. ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు తెలంగాణ గురించి మాట్లాడడం, తేజస్సు సూర్య నువ్వేమి తెలంగాణను ఉద్ధరించలేదు తెలంగాణకు సాయం చేయలేదు తెలంగాణ యొక్క బాగోగులను చూసుకోలేదు అలాంటి నువ్వు,నీకెక్కడిది మా తెలంగాణ గురించి మాట్లాడడానికి, అనవసరంగా కారు కూతలు కూసేవనుకో ఇకపై నువ్వు తెలంగాణ మాట ఎత్తితే ఢిల్లీలో కూడా నిన్ను అడ్డుకుంటాం, చిత్తశుద్ధి లేని తెలంగాణ బిజెపి ఎంపీలు తెలంగాణ గురించి ఇంత మాట్లాడుతున్న తేజస్వీ సూర్యను ఒక్కసారి కూడా నిలదీయకుండా వాడి వెనకనే వంతపడడం నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,మాజీ జిల్లా అధికార ప్రతినిది ఒడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య,మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జంగం కళ,జిల్లా కార్యదర్శి గోపతి బానేష్,కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్,భీమ మల్లేష్,కూతురు ప్రభాకర్,మెట్ట సుధాకర్, నక్క శ్రీనివాస్,పనస రాజయ్య,చంద్రగిరి ఎల్లయ్య,మేకల శ్రీను,సంఘ తిరుపతి,పందిరి లింగయ్య,ఉటూరి రాజానర్సు,నేరెళ్ల చంద్రయ్య,లక్ష్మా రెడ్డి,లచ్చులు, కనుక్కుట్ల కనకయ్య,సంజీవ రెడ్డి, వేణిగాళ్ల శ్రీనివాస రావు,నాగరాజు, ప్రేమ్ సాగర్, రామ్ సాయి, కుర్మ ప్రసాద్ మహిళ నాయకురాళ్లు పుష్ప, సృజన తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 238
Andhra Pradesh
శ్రీకాకుళం నూతన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కున రాజారావు
జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా...
By Manda Ramkumar 2026-03-27 04:55:05 0 150
Telangana
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా...
By Sidhu Maroju 2025-08-14 10:45:19 0 679
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ   సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
By Rajini Kumari 2025-12-23 10:14:48 0 169
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమలలో ప్రారంభమైన స్వయంబేశ్వర స్వామి
సోమల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ స్వయంబేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం...
By Kothuru Murali 2026-04-13 08:41:51 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com