స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

0
69

 

స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

Andhra

Chandrababu Naidu Reviews Swachh Andhra Progress

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం

100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం

అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు

పచ్చదనం పెంపు, సోలార్ రూఫ్‌టాప్‌లపై దృష్టి సారించాలని సూచన

'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.

 

మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ వెళ్లి 100 శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన వంటగదుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, నెట్ జీరో సాధన, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె బైపాస్‌లో రోడ్డు ప్రమాదం.. 16 మంది భక్తులకు గాయాలు.
మదనపల్లె బైపాస్‌ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది బోయకొండ భక్తులు...
By Pagadala Venkateswar 2026-05-10 05:46:29 0 65
Haryana
Powering the Future: MSMEs to Lead Infrastructure Boost
In a major push for industrial modernization, the Haryana Government, via Uttar Haryana Bijli...
By Dunna Jessicaruth 2026-05-15 06:29:56 0 34
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
Telangana
Sammakk🌷 సారలమ్మ జాతరలో తొలి ఘాట్టం మొదలైoది
*సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది.* జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత...
By CM_ Krishna 2026-01-14 17:47:12 0 326
Andhra Pradesh
ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు.
ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం 104 మొబైల్ వాహనాల ద్వారా...
By Pagadala Venkateswar 2026-04-30 04:33:32 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com