స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

0
109

 

స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు.

Andhra

Chandrababu Naidu Reviews Swachh Andhra Progress

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పురోగతిపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం

100 శాతం ఇంటింటి చెత్త సేకరణ, శుద్ధి జరగాలని ఆదేశం

అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

హాస్టళ్లలో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు

పచ్చదనం పెంపు, సోలార్ రూఫ్‌టాప్‌లపై దృష్టి సారించాలని సూచన

'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.

 

మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ వెళ్లి 100 శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన వంటగదుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు, నెట్ జీరో సాధన, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు
మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి...
By Boiena Rajesh 2026-02-26 15:07:12 0 209
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 227
Maharashtra
Mumbai Rail Chaos: Harbor Line Hit by Wire Snapping
Commuters in Mumbai faced significant travel disruptions early this morning as rail services on...
By Lokeshwari Panthadi 2026-07-01 07:32:05 0 46
Telangana
నర్సంపేట డిపో పెట్రోల్ పోసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 5 లక్షల సహాయం చేయడం జరిగింది
నర్సంపేట: శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం.... భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా ....
By Gujile Ramu 2026-05-04 17:34:30 0 166
Business & Finance
Odisha Secures ₹67,000 Crore Green Energy Investment
The Odisha government has signed a major investment agreement with ACME Group and Japan's IHI...
By Navya Sree 2026-07-04 06:08:43 0 30
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com