మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ

0
179

మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే జన్మదినం: టీడీపీ నాయకుడి శుభాకాంక్షలు.
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ,...
By Pagadala Venkateswar 2026-02-01 10:46:01 0 158
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*   *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...
By Rajini Kumari 2026-04-04 15:35:19 0 231
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్...
By Boya Dasthagiri 2026-07-14 00:50:14 0 63
Andhra Pradesh
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...
By Kothuru Murali 2025-12-26 06:13:47 0 212
SURAKSHA
శీర్షిక: సైబర్ నేరాల పట్ల అప్రమత్తం: ప్రజలకు పోలీస్ అవగాహన
వివరణ: పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు...
By Kalaga Sailaja 2026-06-25 05:41:59 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com