మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ

0
114

మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Kerala
Kerala Temples Told No Politics Allowed
The Kerala government has banned political flags, symbols, and images of political figures in...
By Pooja Patil 2025-09-15 05:26:50 0 278
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
By Kothuru Murali 2026-04-16 17:23:48 0 64
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి...
By Boya Dasthagiri 2026-03-23 12:57:25 0 238
Telangana
బొల్లారం రైల్వే గేట్ రిపేర్ కావడంతో ట్రాఫిక్ జామ్: వాహదారులకు తీవ్ర ఇబ్బందులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / బొల్లారం. బొల్లారం గేట్ వద్ద 50 నిమిషాల ట్రాఫిక్ జాం –...
By Sidhu Maroju 2025-08-05 16:19:28 0 749
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com