మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
Posted 2026-04-18 04:07:43
0
177
మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
In Dubai all airports are closed due to the war
దుబాయ్లో అన్ని విమానాశ్రయాలు మూసివేత
ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రావొద్దని...
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...
భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున...
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…
ఉపాధి కోసం కువైట్ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో...