మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ

0
115

మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బెట్టింగ్ ఊబిలో పడొద్దు - బతుకును చిద్రం చేసుకోవద్దు.|
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని,...
By Sidhu Maroju 2026-03-28 06:16:08 0 136
Andhra Pradesh
Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం.
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:26:59 0 114
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమి వైభవం.. సప్తవాహనాలపై మలయప్ప స్వామి.
Andhra   Ratha Saptami Celebrations in Tirumala  తిరుమలలో వైభవంగా రథసప్తమి మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-01-25 06:18:00 0 119
Telangana
1 sq.yd of land in KPHB has reached up to 2.65 lakhs
The Lands and Plots in KPHB has been sold out in higher rates. The flat of 1400 sft has costed...
By Terli Ashok 2026-02-27 15:34:37 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com