ప్రగతి బాటలో పల్లెలు

0
81

ప్రగతి బాటలో పల్లెలు.

 

పరుగులు పెడుతున్న అభివృద్ధి.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

రూ.92 లక్షలతో కొత్తూరు తాడేపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు ప్రారంభం.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 17.04.2026.

 

కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పట్టాయని, పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. 

 

పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లి గ్రామంలో రూ.92 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను, డ్రెయిన్లను, గోకులం షెడ్లను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు, కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం గారు శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 

కొత్తూరు తాడేపల్లిలో శివారు వేమవరంలో రూ.51.90 లక్షలతో 566 మీటర్ల పొడవుగా సీసీ రోడ్లు, 967 మీటర్ల పొడవునా డ్రెయిన్లు, కొత్తూరు తాడేపల్లిలో రూ.24 లక్షలతో 340 మీటర్ల సీసీ రోడ్లు, 275 మీటర్ల డ్రెయిన్లు, కొత్తూరులో రూ.16 లక్షలతో 125 మీటర్లు సీసీ రోడ్లు, 219 మీటర్ల పొడవునా డ్రెయిన్లను నిర్మించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గంలో పల్లెపండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.32.92 కోట్లు కేటాయించామన్నారు. 

 

పల్లెపండుగ కింద కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగ పరచి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు.ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 136
Andhra Pradesh
పూలు నియోజకవర్గ :ప్రజలకు చుక్కలు చూపిస్తున్న ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరు, పాల్యం పంచాయతీలలో ప్రతిరోజు వేకువజామున ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-02-18 07:34:00 0 133
Andhra Pradesh
కర్నూలు జిల్లా కురవ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కర్నూలు ఎంపీ !!
కర్నూలు : కర్నూలు నగరంలోని పెద్దపాడు రోడ్డు లో గల శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉమ్మడి...
By Hari Krishna 2025-12-29 10:52:45 0 201
Telangana
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
By Krishna Balina 2026-01-19 04:07:35 0 329
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com