నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
115

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!

మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనం.

ఈ నెల 17 వ తేదీన బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టిన వంట నిర్వహకులు.

బల్లి పడిందని విద్యార్థులు చెప్పితే తినండి ఏమి కాదులే అంటూ నవ్విన వంట సిబ్బంది.

తల్లిదండ్రులకు చెపితే టీసీలు ఇస్తామంటూ విద్యార్థులకు బెదిరింపులు?

బల్లి కాదు,మిడత అంటున్న ప్రిన్సిపల్ !

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, వంట సిబ్బంది చలగాటమాడుతున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తెలిపారు.17 వ తేదీన జరిగిన పరిస్థితిని బయటకు రాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని, ఎండాకాలం సెలవులు సందర్భంగా ఈరోజు బయటికి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి తమ పరిస్థితిని వివరించారని తెలిపారు. ఉన్నత అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పైన, వంట సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంవలన 200 మంది విద్యార్తులు విష ఆహరం తిన్నతరువాత వాంతులు చేసుకొవడం జరిగింది. ఎంతో గౌరవంతో హాస్టల్ మీద నమ్మకంతో పేద కుటుంభంనుండి వచ్చిన విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించక అభద్రతా భావంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్ధులు చాలా అవస్తలు పడుచున్నారు. విష ఆహరం వలన విద్యార్థులకు ఎదయినా జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఒక బాధ్యతాయుత అధికారిగా ఉండి విద్యార్థుల విషయంలొ ప్రతి విషయంలోను నిర్లక్ష్యంచేస్తూ విద్యార్ధులపాలిట శాపంగా మారిన కేజీబీవీ ప్రిన్సిపల్ మీద శాఖాపరమైన విచారణ చేసి తక్షణమే విధులనుండి సస్పండ్ చెయ్యాలని ఈ విషయంపై రాబొయే సొమవారం బిజెపి జనతా వారిది PGRS కార్యక్రమంలో తగిన ఆధారాలతో జిల్లా కలెక్టరు గారికి పిర్యాదుచేస్తామని తెలిపారు. 

ప్రిన్సిపల్ గారికి ఈ విషయంపై అరా తియ్యగా ఆ రోజు పడింది బల్లి కాదు, మిడత అంటూ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు మాత్రం మిడత కాదు బల్లి పడిందని ఫోను ద్వారా తమకు తెలిపారన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నారావారిపల్లె సంక్రాంతి సంబరాలు మంత్రి నారా లోకేష్
*Press Release*   *నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి నారా...
By Rajini Kumari 2026-01-13 16:12:47 0 157
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా...
By Kothuru Murali 2026-03-28 06:05:06 0 127
Tripura
Tripura to Set Up Fruit Processing Unit in Dhalai District
To uplift pineapple farmers, the Tripura government plans to establish a fruit-processing...
By Bharat Aawaz 2025-07-17 07:49:55 0 1K
Andhra Pradesh
భోగి సంబరాల్లో వైసిపి నేత దేవినేని అవినాష్
*భోగి పర్వదినం* సందర్భంగా ఎన్టిఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో...
By Rajini Kumari 2026-01-14 12:42:20 0 153
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:08:13 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com