నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
150

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!

మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనం.

ఈ నెల 17 వ తేదీన బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టిన వంట నిర్వహకులు.

బల్లి పడిందని విద్యార్థులు చెప్పితే తినండి ఏమి కాదులే అంటూ నవ్విన వంట సిబ్బంది.

తల్లిదండ్రులకు చెపితే టీసీలు ఇస్తామంటూ విద్యార్థులకు బెదిరింపులు?

బల్లి కాదు,మిడత అంటున్న ప్రిన్సిపల్ !

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, వంట సిబ్బంది చలగాటమాడుతున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తెలిపారు.17 వ తేదీన జరిగిన పరిస్థితిని బయటకు రాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని, ఎండాకాలం సెలవులు సందర్భంగా ఈరోజు బయటికి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి తమ పరిస్థితిని వివరించారని తెలిపారు. ఉన్నత అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పైన, వంట సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంవలన 200 మంది విద్యార్తులు విష ఆహరం తిన్నతరువాత వాంతులు చేసుకొవడం జరిగింది. ఎంతో గౌరవంతో హాస్టల్ మీద నమ్మకంతో పేద కుటుంభంనుండి వచ్చిన విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించక అభద్రతా భావంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్ధులు చాలా అవస్తలు పడుచున్నారు. విష ఆహరం వలన విద్యార్థులకు ఎదయినా జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఒక బాధ్యతాయుత అధికారిగా ఉండి విద్యార్థుల విషయంలొ ప్రతి విషయంలోను నిర్లక్ష్యంచేస్తూ విద్యార్ధులపాలిట శాపంగా మారిన కేజీబీవీ ప్రిన్సిపల్ మీద శాఖాపరమైన విచారణ చేసి తక్షణమే విధులనుండి సస్పండ్ చెయ్యాలని ఈ విషయంపై రాబొయే సొమవారం బిజెపి జనతా వారిది PGRS కార్యక్రమంలో తగిన ఆధారాలతో జిల్లా కలెక్టరు గారికి పిర్యాదుచేస్తామని తెలిపారు. 

ప్రిన్సిపల్ గారికి ఈ విషయంపై అరా తియ్యగా ఆ రోజు పడింది బల్లి కాదు, మిడత అంటూ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు మాత్రం మిడత కాదు బల్లి పడిందని ఫోను ద్వారా తమకు తెలిపారన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన
బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు...
By Boiena Rajesh 2026-03-21 11:14:02 0 239
Andhra Pradesh
మదనపల్లెలో రంజాన్ శుభాకాంక్షలు: మత సామరస్యానికి ప్రతీకగా నాయకులు.
మదనపల్లెలో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం పలువురు నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా శుభాకాంక్షలు...
By Pagadala Venkateswar 2026-03-21 11:26:31 0 180
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 164
Andhra Pradesh
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు...
By Pagadala Venkateswar 2026-01-06 06:43:25 0 220
Andhra Pradesh
మదనపల్లెలో స్థలం కబ్జా వ్యవహారం – లోకాయుక్త సీరియస్
మదనపల్లె BKపల్లి పరిధిలోని 2.92 ఎకరాల మాజీ సైనికుల భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్...
By Pagadala Venkateswar 2026-01-04 07:11:29 0 249
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com