దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు

0
77

*ప్రచురణార్థం*

02.04.26

 

*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*

 

*యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*

 

 *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*

 

 *సానుకూలంగా స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ* 

 

*న్యూఢిల్లీ/ విజయవాడ* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభ లో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. 

 

యువనేత, రాష్ట్ర విద్య - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.

 

 ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు 

 

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు. 

 

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. 

 

దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దేశాన్ని ప్రేమించే వాళ్ళు డ్రగ్స్ ను ముట్టుకోరు ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపి శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్
🇮🇳🇮🇳🇮🇳 *దేశాన్ని ప్రేమించే వాళ్లు డ్రగ్స్‌ను ముట్టుకోరు* – ఏపీ ఈగల్ చీఫ్, ఐజీపీ శ్రీ...
By Rajini Kumari 2026-01-10 13:18:49 0 116
Telangana
అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్ అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన...
By Sidhu Maroju 2025-07-29 10:51:37 0 795
Andhra Pradesh
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-19 18:42:45 0 77
Telangana
4 లెబర్ కోడ్స్ ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతాం.
తేదీ 01/04/2026 రోజు బ్లాక్ డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-01 13:54:23 0 223
Andhra Pradesh
Vande Mataram Coastal Cyclothon’ to Begin on 28th Jan Covering 6,553 Km Coastal Route
చీరాల: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం...
By Gadiyapudi Narendra 2026-02-11 16:53:05 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com