దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన కూటమి ఎంపీలు

0
244

*ప్రచురణార్థం*

02.04.26

 

*దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు*

 

*యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ నేతృతంలో ప్రధానిని కలిసి అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి కృషిచేసిన ప్రధాని మోదీ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు*

 

 *రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరిత గతిన లభించేలా చూడాలని ప్రధానిని కోరిన వైనం*

 

 *సానుకూలంగా స్పందించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ* 

 

*న్యూఢిల్లీ/ విజయవాడ* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ నిన్న లోక్ సభ లో, నేడు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినందుకు కృషి చేసినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి పార్టీల ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. 

 

యువనేత, రాష్ట్ర విద్య - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో గురువారం పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ ని ఆయన కార్యాలయంలో రాజ్యసభ, లోకసభలో కూటమి పార్టీ ఎంపీల బృందం కలిసింది. ప్రధానమంత్రిని నారా లోకేష్ నేతృత్వంలో అమరావతి ప్రాంత విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) తో పాటుగా కలిసిన ఎంపీలు ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలిపారు.

 

 ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్ల‌మెంటు ఆమోదం ల‌భించ‌డానికి కృషి చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కి మంత్రి నారా లోకేష్ , సహచర ఎంపీలతో కలిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) తెలిపారు 

 

పార్లమెంటులో అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన విధంగానే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర త్వరితగతిన వచ్చేలా చూడాలని ప్రధానమంత్రిని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం కోరినట్లు శివనాథ్ తెలిపారు. 

 

అదేవిధంగా అమరావతి ప్రాంత అభివృద్ధికి నిధుల కేటాయింపు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై సైతం ప్రధానితో మంత్రి నారా లోకేష్ తో కలిసి చర్చించినట్లు వివరించారు. 

 

దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం మంత్రి నారా లోకేష్, ఎంపీల బృందం విజ్ఞాపనకు సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధికి సైతం తన సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఎంపీ కేశినేని శివనాధ్ వివరించారు.

Search
Categories
Read More
Telangana
Pipri in adilabad public meeting
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు...
By G k Nookala 2026-04-06 10:08:08 0 183
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 213
Andhra Pradesh
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం...
By Ratna Sekhar 2026-02-19 14:33:13 0 281
Jammu & Kashmir
Jammu and Kashmir's Education Sector Reforms in 2026
Jammu and Kashmir's education sector reforms in 2026 focus on improving learning outcomes through...
By Fathima Safa 2026-06-16 09:22:02 0 70
Business & Finance
Patent Protection Helps Secure Your Innovative Ideas
A patent gives inventors the exclusive legal right to protect their unique products, processes,...
By Navya Sree 2026-07-11 06:31:02 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com