"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!

0
315

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి.

అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన హోండా సిబి యూనికార్న్ (TS10EK 7536) బైక్ దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో.. బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్టన్ గూడ వద్ద షాకింగ్ చోరీ జరిగింది. రోడ్డా శ్రీకాంత్ అనే వ్యక్తి తన యాక్టివా (TS 09 EB 2085) వాహనాన్ని బాలాజీ స్వీట్ హౌస్ ముందు నిలిపారు. అయితే పొరపాటున బండికి తాళం వేయడం మర్చిపోయి లోపలికి వెళ్లారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆ బండిని ఎత్తుకెళ్లారు.

ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాహనదారులు తమ వాహనాలకు విధిగా లాక్ వేసుకోవాలని, సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోనే పార్క్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నందివెలుగు రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి అనుమతులివ్వండి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నందివెలుగు రోడ్డులో జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద కల్వర్టు...
By John Baji 2026-01-23 01:53:03 0 221
Andhra Pradesh
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించాను.
స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా చీరాల మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న స్వామి వివేకానంద...
By Gadiyapudi Narendra 2026-01-12 16:08:44 0 211
Andhra Pradesh
బీజేపీ. జిల్లా ఎస్సీ మోర్చా ద్వారా గురు రవి దాస్ జయంతి
 గురు రవి దాస్ 649 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. గా జు వాక నందు బిజెపి జిల్లాఎస్సీ మోర్చా...
By Mobbu Venkatramana 2026-02-04 12:20:45 0 435
Andhra Pradesh
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-06-25 05:59:04 0 53
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com