ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా 'నరుకుతం’. రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌

0
99

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

‎సందర్భంగా వేదికపై మక్కాన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండక పోవచ్చు. రెండు గంటల్లో ఇక్కడ ఉన్న మేం (తనతోపాటు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, చింతకుంట విజయరమణారావును చూపిస్తూ) ముగ్గురం ఒక్క క్షణంలో వస్తం. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

‎అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‎ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాల్లో ఆయన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా? అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరికేస్తామనడంపై ప్రజాస్వామికవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

‎ఇటీవల అసెంబ్లీలో కేటీఆర్‌, హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మా దగ్గర కండలు తిరిగిన పహిల్వాన్లు ఉన్నరు. రాజ్‌ ఠాకూర్‌ ఉన్నడా?’ అంటూ రామగుండం ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే మక్కాన్‌ సింగ్‌ను ఉసిగొలిపి ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మక్కాన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఎంతమాత్రం మంచిది కాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు,

‎ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలే గానీ, ఇలా అడ్డంగా నరికేస్తామంటూ మాట్లాడుతారా? అని ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని హితవు పలుకుతున్నారు.

Search
Categories
Read More
Telangana
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్...
By Sidhu Maroju 2026-05-23 08:24:41 0 56
Telangana
Telangana gaddar awards
2025 తెలంగాణ "గద్దర్‌ " అవార్డుల ప్రకటన   ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌)...
By G k Nookala 2026-03-07 17:58:32 0 169
Andhra Pradesh
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జెఎసి చైర్మన్ ఏ విద్యాసాగర్
*ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.* *సమాన పనికి సమాన వేతన విధానాన్ని అమలు చేయాలి*...
By Rajini Kumari 2025-12-21 16:26:48 0 213
Telangana
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్
కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు....
By Sidhu Maroju 2025-07-10 05:53:41 0 1K
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com