Direct train from srikakulam road to tirupati

0
160

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.

 

ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రక్షేత్రంతో అనుసంధానం చేస్తూ, భక్తులకు యాత్రను మరింత సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది.

 

ఈ సందర్భంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి, ఈ కొత్త ట్రైన్ సేవపై వారి సంతోషం మరియు సానుకూల స్పందన వినడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

 

ఈ సేవ వేలాది మంది భక్తులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ప్రాంతీయ అనుసంధానం మరియు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

 

ఈ నూతన రైలు ప్రారంభించడానికి సహకరించిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

కూటమి ఎన్‌డీఏ డబల్ ఇంజిన్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో వాల్తేర్ DRM శ్రీ లలిత్ బోహ్రా గారు, అమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు. 

ఇది కేవలం ఒక ట్రైన్ సేవ మాత్రమే కాదు శ్రీకాకుళం ప్రజల ఆశలు మరియు అభివృద్ధిని అనుసంధానించే ఒక కీలక ముందడుగు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 388
Andhra Pradesh
పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు...
By Kothuru Murali 2026-03-13 03:27:21 0 110
Andhra Pradesh
సముద్రంలో మొరాయించిన కోరంగి టూరిజం బోటు – పర్యాటకుల్లో భయాందోళన
తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండ్‌కు 15 మంది పర్యాటకులతో బయలుదేరిన టూరిజం...
By Ratna Sekhar 2026-02-19 14:33:13 0 197
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 195
Telangana
"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"
సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా...
By Sidhu Maroju 2026-04-02 06:49:09 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com