Direct train from srikakulam road to tirupati

0
309

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.

 

ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రక్షేత్రంతో అనుసంధానం చేస్తూ, భక్తులకు యాత్రను మరింత సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది.

 

ఈ సందర్భంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి, ఈ కొత్త ట్రైన్ సేవపై వారి సంతోషం మరియు సానుకూల స్పందన వినడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

 

ఈ సేవ వేలాది మంది భక్తులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ప్రాంతీయ అనుసంధానం మరియు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

 

ఈ నూతన రైలు ప్రారంభించడానికి సహకరించిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

కూటమి ఎన్‌డీఏ డబల్ ఇంజిన్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో వాల్తేర్ DRM శ్రీ లలిత్ బోహ్రా గారు, అమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు. 

ఇది కేవలం ఒక ట్రైన్ సేవ మాత్రమే కాదు శ్రీకాకుళం ప్రజల ఆశలు మరియు అభివృద్ధిని అనుసంధానించే ఒక కీలక ముందడుగు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐడి కార్డులు డౌన్లోడ్ ప్రకారం వేగవంతం చేయాలి - కరణం వెంకటేష్
 చీరాల మండలం రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులకు,పట్టణ పార్టీ...
By Vadlamudi NagaVenkat 2026-04-24 04:14:24 0 255
Andhra Pradesh
విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య 
విద్యార్థుల బంగారు భవితవ్యానికి వారధి ఇంటర్మీడియట్ విద్య  విట్ తో విజిఆర్ యం విద్యాసంస్థ...
By Gadiyapudi Narendra 2026-01-03 09:15:49 0 236
Madhya Pradesh
Madhya Pradesh Expands Digital Governance and Services
Madhya Pradesh is advancing digital governance by expanding online citizen services,...
By Fathima Safa 2026-06-30 08:30:02 0 48
Andhra Pradesh
Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు.
Telugu University Dispute: తెలుగు వర్సిటీల మధ్య వివాదం.. ఏపీ వీసీకి తెలంగాణ లీగల్ నోటీసులు...
By Pagadala Venkateswar 2026-03-10 04:49:59 0 159
Delhi - NCR
The City That Never Learns: A Midnight Nightmare in a Moving Fortress
The 2012 echoes returned to Delhi’s streets this Monday as a 30-year-old mother was...
By Dunna Jessicaruth 2026-05-15 08:58:42 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com