ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

0
268

రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది._

 

_ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు._

 

_అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు._

 

*_ఈసారి త్వరగా అడ్వాన్స్‌డ్ పరీక్షలు_*

 

_ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 147
Andhra Pradesh
మదనపల్లి లో చిన్నారి హత్య దారుణం: కళ్యాణ్ భరత్
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చిన్నారి రిషిక ప్రియ హత్య దారుణమని వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం...
By Kothuru Murali 2026-02-18 07:21:26 0 144
Telangana
తెలంగాణ : ప్రభుత్వంతో చర్చలు సఫలం సమ్మె విరమించిన RTC కార్మికులు
RTC సమ్మె ఎట్టకేలకు ముగిసింది ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను...
By Sunka Santhosh 2026-04-25 04:47:35 0 196
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 33
Andhra Pradesh
పుంగనూరులో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వార్షికోత్సవాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు...
By Kothuru Murali 2026-04-22 12:13:28 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com