ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

0
161

రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది._

 

_ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు._

 

_అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు._

 

*_ఈసారి త్వరగా అడ్వాన్స్‌డ్ పరీక్షలు_*

 

_ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళి
గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల...
By Kothuru Murali 2026-04-03 09:54:31 0 114
Andhra Pradesh
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా...
By Gadiyapudi Narendra 2026-01-09 15:45:43 0 229
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:19:48 0 124
Andhra Pradesh
*శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:19:57 0 752
Telangana
భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతకాన్నిఅవిస్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.
మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా...
By Gangaram Rangagowni 2026-01-26 04:31:06 0 353
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com